KXIPvsSRH: అదరగొట్టిన సన్రైజర్స్ బౌలింగ్... స్వల్ప స్కోరుకే పరిమితమైన కింగ్స్ ఎలెవన్...
ఉమ్మడిగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం...
సందీప్ శర్మకు రెండు వికెట్లు... 2 వికెట్లు తీసిన రషీద్ ఖాన్... జాసన్ హోల్డర్కి రెండు వికెట్లు...
11 ఓవర్లకి పైగా బౌండరీ కొట్టలేకపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
32 పరుగులు చేసిన నికోలస్ పూరన్... 27 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 20 పరుగులు చేసిన క్రిస్ గేల్...
IPL 2020: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. కీలక మ్యాచ్లో స్టార్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్కి రెస్టు ఇచ్చి, భారీ మూల్యం చెల్లించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మరోవైపు ఇప్పటిదాకా భారీగా పరుగులిచ్చిన సన్రైజర్స్ బౌలర్లు, కీలక మ్యాచ్లో మెరిసి, ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ మన్దీప్ సింగ్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్రిస్ గేల్ 20 పరుగులు, కెఎల్ రాహుల్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గ్లెన్ మ్యాక్స్వెల్ 12 పరుగులు చేయగా దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. 88 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
జోర్డాన్ 7,మురుగన్ అశ్విన్ 4, నికోలస్ పూరన్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 11 ఓవర్లకి పైగా ఒక్క బౌండరీ కొట్టలేకపోయారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు.