కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్... శ్రీలంకపై రెండో టీ20 వాయిదా
కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్...
బుధవారానికి వాయిదా పడిన రెండో టీ20 మ్యాచ్..
శ్రీలంక, ఇండియా మధ్య జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కి కరోనా ఊహించని షాక్ ఇచ్చింది. భారత ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నేడు జరగాల్సిన మ్యాచ్ను బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వహకులు.
తొలి టీ20 మ్యాచ్లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో బౌలింగ్లో 16 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన కృనాల్ పాండ్యా, బ్యాటింగ్లో మూడు బంతుల్లో మూడు పరుగులు చేశాడు...
ఇప్పటికే లంక బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో జూలై 13న ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్, 18కి వాయిదాపడిన విషయం తెలిసిందే. లంక టూర్లో తొలిసారి కరోనా పాజిటివ్ రావడం విశేషం. కృనాల్ పాండ్యాను క్వారంటైన్కి తరలించిన అధికారులు, మిగిలిన ప్లేయర్లకు కరోనా టెస్టులు నిర్వహించి, నెగిటివ్ వస్తే రేపు మ్యాచ్ నిర్వహిస్తారు.
ఇరు జట్ల ఆటగాళ్లను కూాడా ఐసోలేషన్ లోకి పంపించారు. వారందరికీ పరీక్షలు చేయనున్నారు.