Asianet News TeluguAsianet News Telugu

KKRvsMI: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... రో‘హిట్ మ్యాన్’ షో...

80 పరుగులు చేసిన రోహిత్ శర్మ...

47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్...

KKR vs MI: Mumbai Indians Scored big score against KKR IPL 2020 CRA
Author
India, First Published Sep 23, 2020, 9:36 PM IST

IPL 2020లో ఆడుతున్న రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ ఒక్క పరుగుకే అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రోహిత్ శర్మ. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 90 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ రనౌట్ కాగా... క్రీజులోకి వచ్చిన సౌరబ్ తివారీతో కలిసి దూకుడు కొనసాగించాడు ‘హిట్ మ్యాన్’. 

తివారీ 21 పరుగులు చేసి అవుటైనా... రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగించాడు. 54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ, శివమ్ మావీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా 18 పరుగులు చేసి హిట్ వికెట్‌గా అవుట్ కాగా... కిరన్ పోలార్డ్ 13, కృనాల్ పాండ్యా 1 పరుగు చేశారు. శివమ్ మావీకి 2 వికెట్లు దక్కగా సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios