రోహిత్ శర్మ మరో ఫ్యాన్ బాయ్ మూమెంట్..!
తన జెర్సీ మీద రోహిత్ తో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రెటీ హోదా ఉంటుంది. మన దేశంతోపాటు.. ఇతర దేశాల్లోనూ వారికి అభిమానులు ఉంటారు. చాలా మంది అభిమానులు.. తమ అభిమాన క్రికెటర్ దగ్గర ఆటోగ్రాఫ్, ఫోటో గ్రాఫ్ తీసుకోవాలని ఆశపడుతుంటారు. అలాంటి అవకాశం రాగానే సద్వినియోగం చేసుకున్నారు.
మొన్న ఢిల్లీ ప్లేయర్ ఆవేశ్ ఖాన్.. రోహిత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా.. మరో క్రికెటర్ కూడా .. రోహిత్ పై ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని ప్రదర్శించాడు. రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ చేతన్ సకారియా .. రోహిత్ అంటే తనకు ఎంత ఇష్టమో అందరి ముందు నిరూపించుకున్నాడు.
అందుకే.. తన జెర్సీ మీద రోహిత్ తో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కొద్ది రోజుల క్రితం.. ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన అవేష్ ఖాన్ కూడా.. తన చొక్కా విప్పి మరీ రోహిత్ శర్మ దగ్గర ఆటో గ్రాఫ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా... నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది.
172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్(70 నాటౌట్: 50 బంతుల్లో.. 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్థ సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి రాజస్థాన్ బౌలింగ్పై ఎదురు దాడి చేశాడు. అతడికి కృనాల్ పాండ్యా(39: 26 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్లు) చక్కగా సహకరించాడు.
దీంతో ముంబై మరో 9 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ను మట్టి కరిపించింది. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ డీకాక్కు దక్కింది. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్కు 2 వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్కు ఓ వికెట్ దక్కాయి. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. రాజస్థాన్ ఏడో స్థానానికి పడిపోయింది.