నటాషాని మిస్ అవుతున్న హార్దిక్.. పాత ఫోటోలు షేర్ చేస్తూ..
దూరం బాగా పెరిగిపోవడంతో.. సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేశాడు. గతంలో వారు సింగపూర్ ట్రిప్ వెళ్లిన నాటి ఫోటోలను కూడా షేర్ చేయడం గమనార్హం.
టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మన్ హార్దిక్ పాండ్యా.. తన లైఫ్ పార్ట్ నర్ నటాషాని బాగా మిస్ అవుతున్నాడు. అందుకే గతంలో నటాషాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. నటాషా మాత్రం ముంబయిలోనే ఉండిపోయిందది. ఈ క్రమంలో.. దూరం బాగా పెరిగిపోవడంతో.. సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోలను షేర్ చేశాడు. గతంలో వారు సింగపూర్ ట్రిప్ వెళ్లిన నాటి ఫోటోలను కూడా షేర్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. హార్దిక్, నటాషా జంట ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ జంట తమ బిడ్డకు ఆగస్త్య అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బాబు గుజరాత్లోని ఆనంద్లో వున్న ఆకాంక్ష ఆసుపత్రిలో పుట్టాడు. తమ జీవితంలోకి ఆగస్త్యను తీసుకొచ్చినందుకు గాను హార్దిక్- నటాషాలు అక్కడి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఈ ఏడాది జనవరిలో నటాషాకు హార్దిక్ తన మనసులోని మాటను చెబుతూ ఉంగరాన్ని బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
సెర్బియన్ నటి అయిన నటాషా.. ప్రకాశ్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2014-2015లో రియాలిటీ షో ‘‘ బిగ్ బాస్ 8’’లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పుక్రీ రిటర్న్స్, మెహబూబా, జిందగీ మేరి డ్యాన్స్ డ్యాన్స్, డాడీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. దీనితో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లో కొన్ని ఐటెం సాంగుల్లో కూడా నటించింది. నటాషా చివరి సారిగా డ్యాన్స్ రియాలిటీ షో ‘‘ నాచ్ బాలియే 9’’లో టీవీ నటుడు, స్నేహితుడు అలీ గోనీతో కలిసి కనిపించింది.