నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా... అజింకా రహానే అవుట్...
37 పరుగులు చేసిన కెప్టెన్ అజింకా రహానే...
144 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...
యువ ఆటగాళ్ల రాణింపుపైనే భారత జట్టు ఆశలు...
గబ్బా టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 93 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన కెప్టెన్ అజింకా రహానే... మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మాథ్యూ వేడ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 144 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...
మయాంక్ అగర్వాల్తో పాటు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. ఇంకా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 220 పైగా పరుగుల దూరంలో ఉంది భారత జట్టు. ఈ ఇద్దరు యంగ్ బ్యాట్స్మెన్ రాణించడంపై భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది.
మొదటి ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్ 7, రోహిత్ శర్మ 44, ఛతేశ్వర్ పూజారా 25 పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే.