Asianet News TeluguAsianet News Telugu

నిన్ను బాగా మిస్ అవుతున్నానయ్యా... మొహాలీలో విరాట్ కోహ్లీ, ‘మిస్సింగ్ హబ్బీ’ అంటూ అనుష్క పోస్ట్...

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం మొహాలీ చేరుకున్న భారత జట్టు... విరాట్ కోహ్లీతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ‘మిస్సింగ్ హబ్బీ’ అంటూ పోస్టు చేసిన అనుష్క శర్మ..

Anushka Sharma posts Missing Hubby post after Virat Kohli reaches Mohali for Australia Series
Author
First Published Sep 18, 2022, 12:56 PM IST

ఇండియాలో మోస్ట్ ఫాలోయింగ్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ. పెళ్లైన తర్వాత మొదటి ఏడాది సరిగ్గా 27 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని చెప్పిన విరుష్క జోడికి లాక్‌డౌన్ టైం బాగా అంటే బాగా కలిసి వచ్చింది. ఈ సమయంలోనే అనుష్క గర్భం దాల్చడంతో కుటుంబంతో గడపడానికి ఈ ఇద్దరూ ఇచ్చే ప్రాధాన్యం పెరుగుతూ పోయింది..

ఐపీఎల్ 2020 సీజన్ నుంచి విరాట్ కోహ్లీ ఆడే ప్రతీ సిరీస్‌కి వెన్నంటే ఉంటోంది అనుష్క శర్మ. యూఏఈ, ఇంగ్లాండ్ టూర్‌లకు భార్యను వెంట తీసుకెళ్లిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ అనుష్కను వెంటతీసుకెళ్లాడు...

ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత కొన్నిరోజులు భార్య అనుష్క శర్మ, కూతురు వామిక కోహ్లీలతో కలిసి గడిపిన విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం మొహాలీ చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచుల సిరీస్‌‌లో భాగంగా మొహాలీలో సెప్టెంబర్ 20న తొలి టీ20 మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...

ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా అండ్ కో... మొహాలీ చేరుకుని బీసీసీఐ క్యాంపులో చేరారు. కోహ్లీ, మ్యాచ్ కోసం అలా వెళ్లాడో లేదో మా ఆయన్ని బాగా మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది అనుష్క శర్మ...

‘ఈ వ్యక్తితో ఉంటే ప్రపంచం చాలా ప్రకాశవంతంగా, మరింత ఉత్సాహంగా, ఎంతో సరదాగా... అంతకుమించి అందంగా కనిపిస్తుంది. ఇతనితో కలిసి హోటల్ గదిలో బయో బబుల్‌లో గడిపినా బాగుంటుంది...’ అంటూ పోస్ట్ చేసిన అనుష్క శర్మ, ‘#MissingHubby టూ మచ్ పోస్ట్’ అంటూ విరాట్‌ని మిస్ అవుతున్నానని రాసుకొచ్చింది...

దీనికి విరాట్ కోహ్లీ వెంటనే స్పందించాడు. ‘లవ్ ఇన్ఫినిటీ లవ్’అంటూ అమితమైన ప్రేమను అందిస్తున్నానంట ఎమోజీలను పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ పోస్టుకి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా లవ్ సింబల్‌తో స్పందించాడు...

మూడేళ్లుగా ఊరిస్తున్న 71వ సెంచరీని ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేసి టీ20 ఫార్మాట్‌లో మొట్టమొదటి శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో ఫోకస్ అంతా విరాట్ కోహ్లీపైకి మళ్లింది. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడని  ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అతని అభిమానులు. ఆస్ట్రేలియాపై టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది..

ఆస్ట్రేలియాపై ఇప్పటిదాకా 19 టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 59.83 సగటుతో 146.23 స్ట్రైయిక్ రేటుతో 718 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు, ఆస్ట్రేలియాతో మూడు, సౌతాఫ్రికాతో 3 టీ20 మ్యాచులు ఆడబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios