భారతదేశంలోని డిజిటల్ మీడియా నియంత్రించేందుకు, వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంలో Press and Periodicals Bill లో సవరణలను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తున్న సవరణ చట్టం ప్రకారం ఇక పై డిజిటల్ వెబ్ న్యూస్  పోర్టల్స్  "ఉల్లంఘనల" పై చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. అలాగే బిల్లు ఆమోదం పొందిన వెంటనే న్యూస్ డిజిటల్ పోర్టల్స్ అన్నీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వ నియంత్రణలో భాగం కాని మీడియా నమోదు (Registration of media) కొత్త చట్టంలో భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ మీడియా కూడా చేర్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, డిజిటల్ న్యూస్ సైట్‌లు రిజిస్ట్రేషన్ రద్దు, జరిమానాలతో సహా "ఉల్లంఘన" కోసం చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సమాచార. ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్, పీరియాడికల్ బిల్లు (Press and Periodicals Bill) రిజిస్ట్రేషన్ సవరణ ప్రక్రియను ప్రారంభించింది. దీని పరిధిలోకి డిజిటల్ మీడియాలో వార్తలను కూడా చేర్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ పనిని చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు చేయాలి. దీనితో పాటు, డిజిటల్ ప్రచురణకర్తలు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌తో నమోదు చేసుకోవాలి, ఉల్లంఘన విషయంలో వివిధ ప్రచురణలపై చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు మరియు జరిమానా కూడా విధించవచ్చు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో అప్పీలేట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. డిజిటల్ మీడియా ఇప్పటి వరకు ఎలాంటి చట్టానికి లేదా నిబంధనలకు లోబడి లేదు. ఈ బిల్లు సవరణలు డిజిటల్ మీడియాను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి తీసుకువస్తాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, బిల్లు ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం 'ఆమోదం' పొందలేదు. 2019 సంవత్సరంలో, ముసాయిదా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు, కేంద్రం డిజిటల్ మీడియాలో వార్తలను ఇంటర్నెట్, కంప్యూటర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయగల డిజిటల్ ఫార్మాట్‌లో వార్తలుగా నిర్వచించింది. ఇందులో వీడియో, టెక్స్ట్, ఆడియో మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇవి చాలా గందరగోళం కలిగించాయి.అంతేకాదు డిజిటల్ వార్తా మాధ్యమాన్ని నియంత్రించే ప్రయత్నంగా పరిగణించబడ్డాయి. ప్రెస్, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు దేశంలోని వార్తాపత్రికలుప్రింటింగ్ ప్రెస్‌లను నియంత్రించే బ్రిటిష్ కాలం నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867 స్థానంలో అమల్లోకి వస్తుంది.