Karvy కుంభకోణంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లపై SEBI(Securities and Exchange Board of India) కొరడా ఝుళిపించింది. కార్వీపై సకాలంలో ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, రెండు స్టాక్ ఎక్స్ చేంజీలపై రెండు వేర్వేరు ఆర్డర్లలో BSEపై రూ.3 కోట్లు, NSEపై రూ.2 కోట్లు చొప్పున జరిమానా విధించింది.
Sebi penalises BSE, NSE: దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు BSE-NSEలపై క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ Securities and Exchange Board of India (SEBI) పెనాల్టీ (SEBI Penalises BSE, NSE) విధించింది. బ్రోకరేజ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ స్కామ్కు సంబంధించిన విషయంలో BSE, NSEలలో ఈ పెనాల్టీ విధించారు. సెబీ ప్రకారం, ఖాతాదారులకు రూ. 2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం అవకుండా నిరోధించడానికి కార్వీపై సకాలంలో ఎటువంటి చర్య తీసుకోలేదని, అలాగే ఈ విషయంలో విచారణలో అలసత్వం వహించిందని, Securities and Exchange Board of India (SEBI) రెండు వేర్వేరు ఆర్డర్లలో BSEపై రూ.3 కోట్లు, NSEపై రూ.2 కోట్లు జరిమానా విధించింది.
ఇది అసలు విషయం
ఈ మొత్తం కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ ( Karvy Stock Broking) దాని క్లయింట్ల సెక్యూరిటీలను దుర్వినియోగం చేయడంతో ఈ కుంభకోణం సంబంధించినది. కార్వీ స్కాం విషయానికి వస్తే డీమాట్(demat accounts) ఖాతాలు ఉన్న ఖాతాదారుల షేర్లను ప్రముఖ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి వాటి ద్వారా లాభాలు దక్కేలా చేస్తామంటూ కార్వీ నిర్వాహకులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఖాతాదారులకు తెలియకుండా షేర్లను డీమాట్ ఖాతాల నుంచి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కార్వీ ద్వారా షేర్లు కొని ఎక్కువ కాలం పాటు పట్టించుకోకుండా వదిలేసిన దాదాపు 95 వేలకు పైగా డీమాట్ ఖాతాల్లోని షేర్లను అక్రమ పద్దతుల్లో తమ ఖాతాలోకి బదలాయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాదు ఆ షేర్లను సొంత షేర్లుగా బ్యాంకులను నమ్మించడంతో పాటు, వాటిని తనఖా పెట్టి దాదాపుగా రూ. 2,873 కోట్ల రుణాలు పొందారు.
ఒక అంచనా ప్రకారం కార్వీ (Karvy) రూ.2300 కోట్ల విలువైన 95 వేలకు పైగా కస్టమర్ల సెక్యూరిటీలను తనఖా పెట్టింది. బ్రోకరేజ్ సంస్థ కస్టమర్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి 8 బ్యాంకులు/ NBFCల నుండి రూ. 851.43 కోట్ల నిధులను సేకరించినట్లు తేలింది.
ఈ కేసులో ఎన్ఎస్ఇ మరియు బిఎస్ఇలతో (BSE and NSE) పాటు సెబి జూన్ 2019 నుండి దర్యాప్తు ప్రారంభించింది. NSE ఫోరెన్సిక్ ఆడిటర్ను నియమించింది. నవంబర్ 2019లో SEBIకి ప్రాథమిక నివేదికను దాఖలు చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిర్థారణ ఉత్తర్వులు జారీ చేసింది. తన 2019 ఆర్డర్లో, డీమ్యాట్ ఖాతా నుండి పూర్తి చెల్లింపు చేసిన అన్ని ప్రయోజనకరమైన యజమానుల ఖాతాలకు NSE పర్యవేక్షణలో సెక్యూరిటీలను బదిలీ చేయాలని డిపాజిటరీలను SEBI ఆదేశించింది.
దీని తరువాత సెక్యూరిటీలు ఖాతాదారులకు తిరిగి అందాయి. డిసెంబర్ 2019లో, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతా నుండి 82559 క్లయింట్లకు సెక్యూరిటీలను తిరిగి ఇచ్చిందని ప్రకటించింది. దీని తరువాత, NSE నవంబర్ 2020లో కార్వీ ఇన్వెస్టర్ల రూ. 2300 కోట్ల విలువైన సెక్యూరిటీలు, ఫండ్లు సెటిల్ అయ్యాయని తెలిపింది. కాగా మంగళవారం, సెబీ ఈ విషయంలో మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. బెంచ్మార్క్ సూచికలు NSE మరియు BSE రెండింటిపై పెనాల్టీ విధించింది.
సెబీ ఏం చెప్పింది ?
సెబీ, మంగళవారం (ఏప్రిల్ 12) జారీ చేసిన ఉత్తర్వులో, కార్వీ తన ఖాతాదారుల డబ్బును అనుమతి లేకుండా దుర్వినియోగం చేసిందని, తద్వారా పెట్టుబడిదారులు, బ్యాంకులు. ఎన్బిఎఫ్సిలకు కలిగే నష్టానికి కార్వీ బాధ్యత వహిస్తుందని, అయితే ఈ బ్రోకరేజ్ సంస్థ బిఎస్ఇ, ఎన్ఎస్ఇలు కంపెనీ సభ్యుడు నియంత్రణ పర్యవేక్షణలో ఉన్నారు. ఇదిలావుండగా, ఈ స్కామ్ను పట్టుకోవడంలో జాప్యం జరిగింది. దీని కారణంగా BSE, NSEలను కూడా SEBI జవాబుదారీగా ఉంచింది. ఈ ఆలస్యం కారణంగా, సెబీ రెండు బెంచ్మార్క్ సూచీలపై పెనాల్టీని విధించింది.