నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశించింది.
స్విట్జర్లాండ్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.
తమ వినతి మేరకు రూ.44.41 కోట్లు డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పోరేషన్ కంపెనీ ఖాతాను సింగపూర్ కోర్టు నిలిపివేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ కంపెనీకి మయాంక్ మొహ్తా, పూర్వీ మోడీలు ఓనర్లు. భారత బ్యాంకుల నుండి ఈ సొమ్మును అక్రమంగా తరలించారని ఈ ఖాతాలను నిలిపివేయాలని ఈడీ అభ్యర్థించింది.
ఈ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొందని ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వి ఖాతాను స్విస్ ప్రభుత్వం స్థంభింపజేసింది. ఇదే తరహాలో సింగపూర్ సర్కార్ కూడ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చిలో నీరవ్ మోడీని బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.