ఆయుర్వేదం, సహజ ఉత్పత్తులపై అపోహలు ప్రచారం చేస్తూ పతంజలి ప్రతిష్టను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాబా రామ్దేవ్ అన్నారు. బాబా రామ్దేవ్ కంపెనీ పతంజలికి వ్యతిరేకంగా కార్పొరేట్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, మేధావులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.