గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆస్తి తగాదాల నేపథ్యంలో  ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంట్లో భార్య లేని సమయంలో రమణమూర్తి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు నాగ దినేష్, సాయి‌లను గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. 

ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.