విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. 

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. కార్యాలయానికి సంబంధించిన బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మంగళవారం ఫ్యూజులు తొలగించి సరఫరా నిలిపివేసింది. టీడీపీ కార్యాలయం సుమారు రూ.4.8 లక్షల మేర విద్యుత్‌ శాఖకు బకాయిపడింది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

. గతంలో పార్టీ కార్యాలయ వ్యవహారాలను సీనియర్‌ నేత ఎంవీవీఎస్‌ మూర్తి చూసుకునేవారు. ప్రతి నెలా రూ.80 వేల వరకూ బిల్లు వచ్చేది. ఆయనే చెల్లించేవారు. ఆయన మరణానంతరం ఈ బిల్లులు చెల్లించేందుకు ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో బకాయిలు పేరుకుపోయి ఈ పరిస్థితి తలెత్తింది.