స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే.. అడ్డంగా దొరికినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు: సీఎం జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత 45 ఏళ్లుగా దోపిడీని రాజకీయంగా మార్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. ఇటీవలే అవినీతి కేసులో సాక్షాలు, ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత 45 ఏళ్లుగా దోపిడీని రాజకీయంగా మార్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. ఇటీవలే అవినీతి కేసులో సాక్షాలు, ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని చెప్పారు. నిడదవోలులో కాపు నేస్తం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని దొంగతనాలు చేసిన, దోపిడీ చేసిన, వెన్నుపోటులు పొడిచిన.. ఆయనను రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగల ముఠా సభ్యులు ఉన్నారని అన్నారు. అయితే చట్టం ఎవరికైనా ఒక్కటేనని చెప్పేవారు ఇంతకాలం లేరని చెప్పారు. మాములు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్న వ్యక్తి కూడా తప్పు చేస్తే అలాంటి శిక్ష పడుతుందని.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అనే వాయిస్ ఈరోజు వచ్చిందని చెప్పారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొంగగా దొరికిన.. ఆయన చేసినది నేరమే కాదని వాదించడానికి అందులో వాటా దారులు వెంటనే రెడీ అయ్యారని విమర్శించారు. చంద్రబాబు అడ్డంగా దొరికిన ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడని అన్నారు. ఎల్లో మీడియా నిజాలను చూపించరని, నిజాలను వినిపించరని విమర్శించారు. ఆ పని సబబే అని కూడా సపోర్టు చేస్తారని.. వీటిన్నింటిపై ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.
‘‘లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి.. చంద్రబాబే ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టించాడు. సీమెన్స్ కంపెనీనే రూ. 371 కోట్లు తమకు ముట్టలేదని.. ఆ అగ్రిమెంట్తో తమకు సంబంధం లేదని చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఈడీ కూడా ఫేక్ అగ్రిమెంట్ చేసిన దొంగలను అరెస్ట్ చేసినప్పటికీ.. ఆ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సాక్షాలు ఉన్నాయి. అధికారులు డబ్బులు ఇవ్వద్దని చెప్పిన వాటన్నింటికి పక్కకు పెట్టి చంద్రబాబు 13 సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టంగా సంతకాలు చేశాడు. సీఐడీ వాళ్లు ఇవన్నీ చూపిస్తున్నారు. ఆ డబ్బులు డొల్ల సూట్కేసు కంపెనీలకు ఎలా మళ్లించాయో ఈడీ కనుక్కొని అరెస్ట్లు చేసింది.
చంద్రబాబు పీఏ.. ఇంకో కేసులో దీనితో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగొలుగా సెల్ఫోన్ చాట్లు, ఈమెయిల్స్తో దొరికిపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్కు చంద్రబాబు పీఏ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి.. ఆధారాలు చూపించారు. కోర్టులో ఇరువైపు వాదనల తర్వాత ఆధారాలు చూసిన తర్వాత కోర్టు చంద్రబాబును రిమాండ్కు పంపితే.. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాన్ని చూపించరు. నిస్సిగ్గుగా చంద్రబాబుకు సపోర్టు చేస్తారు. ప్రభుత్వ ధనం రూ. 371 కోట్లను ప్రజలకు చెందాల్సిందనని.. ఎక్కడికి పోయిందని చంద్రబాబును కాకుండా ఎవరిని అడగాలి?. దీనిని ఎవరూ ప్రశ్నించని వ్యవస్థలో బతుకుతున్నాం. దొంగ వాళ్లవాడే కాబట్టి.. వాటాలు పంచుతాడు కాబట్టి ఎవరూ మాట్లాడరు.
బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటని చెత్త పలుకులు రాసేది ఒక్కడు.. బాబు అవినీతిని దాచేందుకు అష్టకష్టాలు పడేది ఇంకొకడు.. ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్లి ములఖాత్లో మిలాఖత్ చేసుకున్నాడు’’ అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.