కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై యువకుడిని అంద మరో వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు. మృతిచెందిన యువకుడిని శివగా గుర్తించారు.

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై యువకుడిని అంద మరో వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు. మృతిచెందిన యువకుడిని శివగా గుర్తించారు. వివరాలు.. శివ ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో సినిమా చూసేందుకు వెళ్లాడు. అయితే థియేటర్ వద్ద శివపై మణి అనే వ్యక్తి దాడి చేశాడు. అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శివ, మణి మధ్య మహిళ విషయంలో విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. శివ మరణవార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, ఈ కేసులో నిందితుడిగా ఉన్న మణి పోలీసుల ముందు లొంగిపోయాడు.