Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలు మోసం చేసిందని.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య....

ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బు, బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫొటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకు చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహం అయిందని, భార్యభర్తలు విడిపోయినట్టు సమాచారం. 

Young man commits suicide by taking selfie video in rajahmundry
Author
Hyderabad, First Published Jan 29, 2022, 12:32 PM IST

రాజమండ్రి : అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో lover మోసం చేసిందని కొప్పిశెట్టి శంకర్ రావు అనే యువకుడు suicideకు పాల్పడ్డాడు. love పేరుతో తన వద్ద నుంచి భారీగా money, బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని marriage చేసుకుంటోందని యువకుడు Selfie videoలో తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫొటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి cheating చేసినందుకు చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహం అయిందని, భార్యభర్తలు విడిపోయినట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ 23న... ఉత్తరప్రదేశ్లోని లలిత్ పూర్ లో ఒక యువకుడు రైలు కింద పడి suicide చేసుకున్నాడు. ఒక యువతి ఈ  యువకుడిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం లలిత్‌పూర్- బీనా మార్గంలోని రైలు పట్టాలపై ఒక యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడిని కక్రువా గ్రామానికి చెందిన దేవేంద్ర (30)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ఈ సందర్భంగా మృతుని సోదరుడు ఇంద్ర పాల్ మాట్లాడుతూ తన సోదరుడు పనారీ గ్రామంలో ఉంటూ truck driver గా పని చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం తన సోదరుడి వద్ద నుంచి లక్ష రూపాయల సొమ్మును ఓ యువతి తీసుకుని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా తన సోదరుడిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 

కాగా, దేవేంద్ర తాను ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన వీడియోలో ‘జైన్ మందిరం సమీపంలో ఒక మహిళ పనిచేస్తున్నది. ఒక యువకుడు కూడా ఆమెతో పాటు ఉంటున్నాడని, తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ యువతి Cheating చేసిందని, దీనిని తట్టుకోలేక తాను రైలు పట్టాలపై కూర్చున్నానని, రైలు రాగానే ఆత్మహత్య చేసుకుంటానని, ఆమెను వదిలిపెట్టవద్దని’ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇలాంటి ఘటన 2022 డిసెంబర్ లోనూ జరిగింది. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఓ అమ్మాయి ఏకంగా అత‌డిని వాడుకొని రూ.35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుపెట్టించుకుంది. చివ‌రికి నువ్వెవ‌రో తెలియదంటూ మోహం చాటేసింది. ఈ ఘటన పంజాబ్‌లో డిసెంబర్ 24న చోటుచేసుకుంది.

పంజాబ్‌కు చెందిన హ‌రిప్రీత్ సింగ్‌కు అస్ట్రేలియా వెళ్లాల‌ని కోరిక‌. దాని కోసం IELTS ప‌రీక్ష రాశాడు. మంచి స్కోర్ రాక‌పోవ‌డంతో వీసా రిజెక్ట్ అయ్యింది. దీంతో స్పౌస్ వీసాతో అస్ట్రేలియా వెళ్లాల‌ని అనుకున్నాడు. IELTSలో మంచి మార్కులు సాధించిన యువ‌తి అమ‌న్‌జ్యోత్ ను 2018లో పెళ్లి చేసుకున్నాడు. చ‌దువుకయ్యే ఖ‌ర్చు మొత్తం తానే భ‌రిస్తాన‌ని మాటిచ్చాడు. 2019లో ఆమెను అస్ట్రేలియాకు పంపించాడు. అనుకున్నట్టుగానే మూడేళ్ల పాటు ఆమె చ‌దువుక‌య్యే ఖ‌ర్చు మొత్తం భ‌రించాడు. 

ఒక సంద‌ర్భంలో త‌న ఆస్తి అమ్మి రూ.35 ల‌క్ష‌లు ఆమె చేతికి ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియ‌దు గానీ అత‌డిని జీవితభాగ‌స్వామి వీసాపై అస్ట్రేలియా తీసుకెళ్ల‌డానికి ఆమె ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. రెండు సార్లు వీసా కోసం అప్ల‌య్ చేసుకున్న‌ప్ప‌టికీ ఆ యువ‌తి త‌మ‌కు పెళ్లి కాలేద‌ని చెప్ప‌డంతో అది రిజెక్ట్ అయ్యిందని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. దీంతో పోలీసులు ఆ యువ‌తిపై, ఆ కుటుంబానికి చెందిన మ‌రో ఇద్దరిపై కేసు న‌మోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios