Asianet News TeluguAsianet News Telugu

వారాహి విజయయాత్ర .. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, జనసేన పార్టీకి విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు

visakhapatnam police issued notices to janasena party ksp
Author
First Published Aug 11, 2023, 4:01 PM IST

జనసేన పార్టీకి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 30 కింద జనసేనకు నోటీసులు జారీ చేశారు. బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని పోలీసులు హెచ్చరించారు. జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావుకు నోటీసులు అందజేశారు. బహిరంగ సభల్లో జాగ్రత్త వహించాలని , లేకపోతే నిర్వాహకులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios