Asianet News TeluguAsianet News Telugu

దివ్యతేజ హత్య: నాగేంద్ర పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

 ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీస్ కస్టడీకి కోర్టు అంగీకరించింది.

Vijayawada police gets permission from court to custody of nagendra lns
Author
Vijayawada, First Published Nov 16, 2020, 6:50 PM IST

విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీస్ కస్టడీకి కోర్టు అంగీకరించింది.

ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నాగేంద్రను కస్టడీకి ఇస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడి నాగేంద్ర నుండి ఇంకా వివరాలను చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నాగేంద్రను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. దీంతో నాగేంద్రను కస్టడీకి ఇస్తూ  కోర్టు ఇవాళ  అంగీకరించింది.

ఈ నెల 18వ తేదీన జైలు నుండి దిశ పోలీసులు నాగేంద్రను కోర్టు నుండి తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ విషయమై మచిలీపట్నం, రాజమండ్రి జైళ్ల అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు.

also read:దివ్య కేసు: పోలీసుల అదుపులో నాగేంద్ర.. ఛార్జిషీటు దాఖలు చేసిన దిశా టీమ్

ఈ నెల 6వ తేదీన నాగేంద్రను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన దివ్యతేజను నాగేంద్ర కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు.

నాగేంద్ర దాడిలో దివ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఈ నెల 6వ తేదీ డిశ్చార్జ్ అయ్యాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios