అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చొని వారిని ఉద్దరిస్తున్నట్లు చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చొని వారిని ఉద్దరిస్తున్నట్లు చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

 ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.