టీడీపీ ఎంపీల విలీనానికి వెంకయ్య ఆమోదం
రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఆరుగురు ఎంపీల్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని గురువారం నాడు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.
రాజ్యసభలో వెబ్సైట్లో టీడీపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అప్డేట్ చేశారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించారు.
ఈ విలీన ప్రక్రియ చెల్లదని శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు తర్వాత రాజ్యసభ చైర్మెన్ను కలవాలని ఐదుగురు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. ఈ లోపునే విలీన ప్రక్రియకు ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది.