Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఎంపీల విలీనానికి వెంకయ్య ఆమోదం

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
 

vice president approves to tdpp merger into bjp in rajyasabha
Author
Amaravathi, First Published Jun 21, 2019, 3:32 PM IST

న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఆరుగురు ఎంపీల్లో  సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,  సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు‌ టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని గురువారం నాడు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా  టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.

రాజ్యసభలో వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అప్‌డేట్ చేశారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించారు.

ఈ విలీన ప్రక్రియ చెల్లదని శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు తర్వాత రాజ్యసభ చైర్మెన్‌ను కలవాలని  ఐదుగురు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. ఈ లోపునే  విలీన ప్రక్రియకు ఆమోదం తెలపడం  చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios