Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో కత్తితో నరికి వైస్ ఎంపీపీ దారుణ హత్య..

శ్రీకాకుళంలో వైసీపీకి చెందిన ఓ వైస్ ఎంపీపీ దారుణ హత్యకు గురయ్యాడు. వాకింగ్ వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

Vice MPP brutally murdered in Srikakulam
Author
First Published Dec 6, 2022, 12:39 PM IST

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత, గార్ల మండల వైస్ ఎంపీపీ రామశేషును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ బయట ఆయన వాకింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో దుండగులు కాపుకాచి హతమార్చారు. దాడికి పాల్పడింది ముగ్గురు నిందితులుగా తెలుస్తోంది. వీరు పల్సర్ బైక్ మీద వచ్చారని సమాచారం.

వాకింగ్ చేస్తున్న రామశేషును కత్తితో మెడమీద దాడిచేసి హత్య చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రామశేషు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియగానే వెంటనే కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను చూసి వారి రోదనలు మిన్నంటాయి. హత్య సమాచారం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించి.. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. వాకింగ్ చేస్తున్న సమయంలో దుండగులు చెలరేగడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలిసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ నాయుడు, స్థానిక వైసీపీ నేతలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య విషయం మీద వీరు కూడా ఆరా తీస్తున్నారు. 

గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకుని..

ఇదిలా ఉండగా, 

బెంగళూరులోని సెక్యూరిటీ కెమెరాలో ఓ దారుణ ఘటన రికార్డయ్యింది. ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఓ 30 ఏళ్ల వ్యక్తిని ఇటుకతో తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. గత శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో క్లిప్‌లో బెంగళూరులోని కెపి అగ్రహార ప్రాంతంలో ఒక గుంపు వీధిలో ఓ అరుగు మీద కూర్చున్న వ్యక్తిమీద దాడికి దిగినట్టుగా కనిపిస్తుంది. కాసేపు వారి మధ్య ఏదో విషయంగా వాగ్వాదం జరిగింది. 

ఆ తరువాత మహిళల్లో ఒకరు పక్కనున్న ఇటుక రాయిని తీసుకుని వచ్చింది. దీంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ అప్పటివరకు మాట్లాడుతున్న పురుషులు, మహిళలు అతడిని పారిపోకుండా ఒడిసిపట్టుకుని.. నేలమీదికి లాగేశారు. ఆ తరువాత ఆ మహిళ, మరో వ్యక్తి అతనిమీద పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు.
 
అందులో ఓ వ్యక్తి మృతుడి తల మీద పదే పదే రాయితో దాడి చేశాడు. ఈ సమయంలో వారంతా అతను పారిపోకుండా పట్టుకని ఉన్నారు. ఈ వీడియో క్లిప్ 1.40 నిమిషాల డ్యూరేషన్ ఉంది. మిగతా వారు కూడా రాళ్లను ఉపయోగించినా.. ఒక వ్యక్తి మాత్రం అతని తలనే లక్ష్యంగా చేసుకుని పగలగొట్టాడు. బాధితుడు అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. దాడి చేసిన వారిలో ఎవరినీ ఇంకా గుర్తించలేదు లేదా అరెస్టు చేయలేదు. బాధితురాలు బాదామి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios