Asianet News TeluguAsianet News Telugu

నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ.. టీడీపీ నేతల్లో చర్చ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. 

vangaveeti radha krishna meets tdp leader nara lokesh ksp
Author
First Published Aug 24, 2023, 6:35 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలో వీరిద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్‌లో వంగవీటి  రాధాకృష్ణ వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం జరగనుంది. అమ్మాయిది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని సమాచారం. నరసాపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లిని  రాధాకృష్ణ వివాహం చేసుకోబుతున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

ALso Read: పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన వంగవీటి రాధాకృష్ణ!.. అమ్మాయి ఎవరంటే..

సెప్టెంబర్‌లో వంగవీటి రాధా వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీని వివాహ ముహుర్తంగా నిర్ణయించినట్టుగా వారు తెలిపారు. అయితే వంగవీటి రాధా తన పెళ్లి విషయం చెప్పడానికే ఇటీవల తన ప్రధాన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయాలని చూసినట్టుగా తెలిసింది. అయితే ఆ తర్వాత ఈ సమావేశాన్ని రద్దు చేసి.. కొంతమంది ఆత్మీయులకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. 

ఇక, వంగవీటి రంగ కుమారుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పెళ్లికి చేసుకోబోతున్నారనే వార్త వినిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios