Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

కేంద్ర న్యాయ, సమాచార మరియు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు

union minister Ravi Shankar Prasad visits tirumala
Author
Tirumala, First Published Aug 30, 2019, 1:39 PM IST

కేంద్ర న్యాయ, సమాచార మరియు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.

union minister Ravi Shankar Prasad visits tirumala

రవిశంకర్ కుటుంబసభ్యులకు శ్రీవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్రమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి చిత్రపటం అందజేశారు.

రవిశంకర్ ప్రసాద్‌తో పాటు స్టార్ షట్లర్ పీవీ సింధు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా శ్రీవారిని దర్శించుకున్నారు. పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios