ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డికి గుండెలోని రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం చంద్రశేఖర్‌రెడ్డిని చెన్నైకి తరలించాలనే ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred