టీటీడీ కి రూ.2కోట్ల విరాళం
బెంగళూరుకి చెందిన సైబర్ హోమ్స్, ఐకోనియా కన్ స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలు ఈ విరాళాన్ని శుక్రవారం అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి రూ.2కోట్ల విరాళం అందింది. బెంగళూరుకి చెందిన సైబర్ హోమ్స్, ఐకోనియా కన్ స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలు ఈ విరాళాన్ని శుక్రవారం అందజేశారు. మొత్తం రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు అందజేయగా..అందులో ఒక కోటి ఒక లక్ష రూపాయలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కి, మిగిలిన ఒక కోటి ఒక లక్ష రూపాలయలను శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కి అందజేశారు. దీనికి సంబంధించిన డీడీని కంపెనీ ప్రతినిధులు ఆలయ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుకి అందజేశారు.