శ్రీకాకుళంలో అమానవీయ ఘటన: ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన దుండగులు
శ్రీకాకుళం జిల్లాలోని మంధస మండలం హరిపురంలో సోమవారంనాడు ఇద్దరు మహిళలపై కంకర పోశారు. స్థానికులు ఆ మహిళలను రక్షించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం:జిల్లాలోని మంథస మండలం హరిపురంలో సోమవారంనాడు ఇద్దరు మహిళలపై కంకర పోశారు..కంకర కింద కూరుకుపోయిన ఓ మహిళలను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు బాధితులు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హరిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు సాలమ్మ, సావిత్రిలు తమ భూమి కబ్జాకు గురౌతుందని గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని 2019 లో దీక్ష కూడా చేశారు. ఈ అయితే ఈ భూమిని ఆనందరావు, ప్రకాష్ రావుతో పాటు రామారావు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. తమ భూమిలో కంకర పోయవద్దని ఈ మహిళలు ఇవాళ ఈ స్థలం వద్దకు చేరకున్నారు. అయితే ఈ ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన కంకరను మహిళలపై పోశారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కంకర కుప్పలో కూరుకుపోయారు..బాధితులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని రక్షించారు.