Asianet News TeluguAsianet News Telugu

శ్రీహరికోటలోని ఇస్రోలో ఆత్మ‌హ‌త్య‌ల క‌ల‌క‌లం.. వారంలోనే ముగ్గురి బ‌ల‌వ‌ణ్మ‌ర‌ణం

Sriharikota: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని ఇస్రోలో వారం వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కాగా, వారిలో ఒకరి భార్య కూడా ఉన్నారు. అయితే, వ‌రుస ఆత్మ‌హ‌త్య‌లు స్థానికంగా ఆందోళ‌న‌ను పెంచుతున్నాయి. 
 

Three people commit suicide at ISRO in Sriharikota within a week
Author
First Published Jan 18, 2023, 12:49 PM IST

Three people commit suicide at ISRO: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉన్న ఇద్దరు పోలీసులతో సహా ముగ్గురు వ్యక్తులు వారం రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కాగా, మూడో వ్యక్తి ఒకరి భార్య ఉన్నార‌ని అక్క‌డి పోలీసులు వెల్ల‌డించారు. 

మొదటి సంఘటన జనవరి 10, 2023 న జరిగింది. 29 ఏళ్ల చింతామణి అనే కానిస్టేబుల్ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చింతామణి పీసీఎంసీ రాడార్ సెంటర్‌లో పనిచేశారు. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి, సిఐఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల వికాస్ సింగ్, శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా, తన సేవా ఆయుధంతో తలపై కాల్చుకుని చనిపోయాడు. విషాదకరంగా, వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ తన బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. శ్రీహరికోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వారం వ్య‌వ‌ధిలోనే ముగ్గురు ఇలా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం స్థానికంగా ఆందోళ‌న క‌లిగిస్తోంది.

స్థానిక అధికారులు ఈ ఘ‌ట‌నల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి)లో సోమవారం మరో సిఐఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడ‌ని తెలిపారు. జిల్లాలోని శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్‌లో నియమించబడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) సిబ్బందిలో 24 గంటల్లో ఇది రెండవ ఆత్మహత్య కేసుగా చెప్పారు. మృతుడు సబ్ ఇన్‌స్పెక్టర్ వికాస్ సింగ్ (30)గా గుర్తించారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా సోమవారం రాత్రి తన సేవా ఆయుధంతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అంతకుముందు, 29 ఏళ్ల చింతామణి స్పేస్‌పోర్ట్ ప్రాంగణంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన పీసీఎంసీ రాడార్ సెంటర్‌లో పనిచేశారు. సుదీర్ఘ సెలవు తర్వాత జవాన్ జనవరి 10న తిరిగి విధుల్లో చేరాడు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఇద్దరు సీఐఎస్‌ఎఫ్‌ వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నారని రెండు వేర్వేరు ఆత్మహత్య కేసులు నమోదు చేసిన శ్రీహరికోట పోలీసులు తెలిపారు. అయితే, దీని గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి వుంద‌ని వెల్ల‌డించారు.

Follow Us:
Download App:
  • android
  • ios