విశాఖలో కిడ్నీ రాకెట్: త్రిసభ్య కమిటీ ఏర్పాటు
విశాఖలో కిడ్నీ రాకెట్ ఉదంతంపై జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణకు ఈ కమిటీ సహకరిస్తోందని ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.
విశాఖపట్టణం: విశాఖలో కిడ్నీ రాకెట్ ఉదంతంపై జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణకు ఈ కమిటీ సహకరిస్తోందని ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.
శుక్రవారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రాకెట్ విషయమై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొంది.ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ చేసి కలెక్టర్కు నివేదికను అందించనుంది. అదే సమయంలో కిడ్నీ రాకెట్లో పోలీసుల విచారణకు అవసరమైన టెక్నికల్ సహాయాన్ని కూడ ఈ కమిటీ అందించనుంది.ఈ కేసులో ఎవరినీ కూడ ఉపేక్షించబోమని కూడ ఏఫీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.