Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..

ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. 

Three Killed in Road Accident in Prakasam District ksm
Author
First Published Sep 17, 2023, 9:45 AM IST

ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాలు.. మద్దిరాలపాడు వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లావారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని బైక్ అదుపు తప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మృతులు వినాయక విగ్రహం కోసం ఒంగోలుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios