Asianet News TeluguAsianet News Telugu

జగన్ సభకి వెళ్తూ ప్రమాదం.. ముగ్గురు నేతలు మృతి

జగన్ సభకి వెళ్తూ.. ముగ్గురు నేతలు ప్రమాదవశాత్తు కన్నుమూసిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చోటుచేసుకుంది. 

three killed in a road accident at orvakallu on the way to jagan meeting
Author
Hyderabad, First Published Feb 7, 2019, 10:12 AM IST

జగన్ సభకి వెళ్తూ.. ముగ్గురు నేతలు ప్రమాదవశాత్తు కన్నుమూసిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు కడపలో  సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ సభలో ఇటీవల టీడీపీని వీడిన  కోట్ల హర్షవర్దన్ రెడ్డి నేడు వైసీపీలో చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులు, సన్నిహితులతో కలిసి కడప సభకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ఓర్వకల్లు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఫ్రమాదంలో కోట్ల అనుచరలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

వారంతా.. కోట్ల హర్షవర్దన్ తోపాటు నేడు వైసీపీలో చేరాలనుకున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios