కర్నూలు జిల్లా సిరాలదొడ్డిలో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు మృతి..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతిచెందారు.
![Three died after fall in lake in kurnool district ksm Three died after fall in lake in kurnool district ksm](https://static-ai.asianetnews.com/images/01ggq2t7d3tg5tjtyyw8wgvs8a/untitled-3-_363x203xt.jpg)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతిచెందారు. చెరువు గుంతలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.