Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ రాళ్ల దాడి, బొండా ఉమా కారు ధ్వంసం: లాఠీచార్జీ, ఉద్రిక్తత


గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కుర్చీలతో దాడికి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు.

Tension prevails after TDP, YCP  workers clashes in Gudivada
Author
Guntur, First Published Jan 21, 2022, 1:39 PM IST

హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని Gudivada లోని నెహ్రు చౌక్ వద్ద TDP  నేతలను పోలీసులు శుక్రవారం నాడు అడ్డుకొన్నారు. గుడివాడలో క్యాసినో సెంటర్  విషయమై నిజనిర్ధారణ కమిటీని పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా టీడీపీ, YCP శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు.

అయితే ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో  నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

casino నిర్వహించిన కె కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వెనుక నుండి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయిటీడీపీ కార్యాలయం  వద్ద నుండి  వైసీపీ శ్రేణులను పంపించి వేశారు.

గుడివాడలో Sankranti పర్వదినం సందర్బంగా  ఈ నెల 14 నుండి క్యాసినో నిర్వహించారు.  ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు.

గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  కోడి పందెలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. 

ఈ ఫంక్షన్ హాల్లో  విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని  టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 500 కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

Casino నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్ర మంత్రికి చెందిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అమ్మాయిలతో నృత్యాలు కూడా నిర్వహించారని టీడీపీ నేతలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గోవా తరహలోనే  ఈ క్యాసినో సెంటర్ ను నిర్వహించారని టీడీపీ ఆ ఫిర్యాదులో పేర్కొంది.ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ఫంక్షన్ హాల్లో  సాగుతున్న తతంగాన్ని ప్రసారం చేశాయి.

ఈ నెల 14 నుండి మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కొందరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు విజయవాడ ఎంపీ కేశినేని నాని నేతృత్వంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఈ విషయమై ఓ సామాజిక కార్యకర్త  వైవీ మురళీకృష్ణ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశారు.  గోవా తర్వాత గుడివాడ క్యాసినో సెంటర్ గా పేరొందిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయని విషయాన్ని కూడా ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. కోట్లాది రూపాయాలను ఈ క్యాసినో సెంటర్ కారణంగా స్థానికులు కోల్పోయారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫంక్షన్ లో హల్ లో సాగిన క్యాసినో సెంటర్ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.  ఈ వీడియోలను కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు.అయితే ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ వెనుక రాజకీయ నేతల అండ ఉందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ కారణంగానే కనీసం కేసులు కూడా నమోదు కాలేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు విచారణ నిర్వహించి సమగ్రంగా నివేదిక  ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios