Asianet News TeluguAsianet News Telugu

సెంథిల్ కుమార్ వ్యాఖ్యలు.. చంద్రబాబు ఇలాకా కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

గురువారం కుప్పంలో జరిగిన వైఎస్‌ఆర్‌సి జనాగ్రహ దీక్షలో సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. Chandrababu Naiduని అనుచిత పదజాలంతో దూషించారని, చంద్రబాబు కుప్పం రాగానే మాజీ ముఖ్యమంత్రి కారుపై బాంబు వేస్తానని బెదిరించే స్థాయికి వెళ్లారన్నారు.

Tension in Kuppam as YSRC, TDP men clash
Author
Hyderabad, First Published Oct 23, 2021, 9:35 AM IST

తిరుపతి : కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నాయకులు, కార్మికులు protestకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ శ్రేణులు టీడీపీ నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ మొదలైంది.

గురువారం కుప్పంలో జరిగిన వైఎస్‌ఆర్‌సి జనాగ్రహ దీక్షలో సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. Chandrababu Naiduని అనుచిత పదజాలంతో దూషించారని, చంద్రబాబు కుప్పం రాగానే మాజీ ముఖ్యమంత్రి కారుపై బాంబు వేస్తానని బెదిరించే స్థాయికి వెళ్లారన్నారు.

సమాచారం ప్రకారం, Senthil వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అతనిపై ఫిర్యాదు చేయాలని ప్లాన్ చేశారు. ప్రతిదాడిగా, వైఎస్‌ఆర్‌సి క్యాడర్ కూడా ర్యాలీని చేపట్టింది. అంతేకాదు తమ నాయకుడు YS Jagan Mohan Reddy ను కించపరిచే పదజాలం ఉపయోగించడానికి చంద్రబాబు తన పార్టీ నాయకులకు అనుమతించినందుకు  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

దీంతో ఇరు వర్గాల మధ్య మొదట వాగ్వాదం మొదలంది. తర్వాత ఇరువర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు కుప్పం పోలీసులు ప్రయత్నించగా, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఒకరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సాదిక్‌ అలీని తోసినట్లు సమాచారం. అయితే, చివరకు పోలీసులు రెండు గ్రూపులను శాంతింపజేసి, టిడి నాయకుల నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఘటనతో Kuppam townలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

ఇదిలా ఉంటే.. పార్టీలపైనా, నేతలపైనా పోలీసుల్ని ప్రయోగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ (కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది ప్రజా దేవాలయమని ఆయన చెప్పారు. 

టీడీపీ నేతలపై దాడులు, మేం ఆధారాలిస్తాం.. మీ యూనిఫాంలు తీసేయండి: పోలీసులపై చంద్రబాబు ఫైర్

డీజీపీ ఆఫీసులకు వంద గజాల దూరంలోనే దాడి జరిగిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీ అనుకుని వుంటే ఇది జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఉగ్రవాదం కాక మరేమిటని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయని.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని వేధించారని చంద్రబాబు ఆరోపించారు. 

పిల్లల భవిష్యత్ నాశనం అయ్యేలా drugs వినియోగం జరుగుతోందని.. డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని ఆయన ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగానికి భయపడి తాము సరెండర్ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో లెక్కడా లేని మద్యం బ్రాండ్లు వున్నాయని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ చిన్న పిల్లాడని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ సీఎంకు డ్రగ్స్‌పై సమీక్ష చేసే తీరిక లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

ఎన్టీఆర్ భవన్‌పై దాడికి సమీక్ష చేస్తారా అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. దాడి చేసినవారిపై కేసులు లేవని.. pattabhi తిట్టారని కేసులు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. పట్టాభి ఏదో తిట్టారంట.. ఆ తిట్టు ఏంటో కూడా తనకు తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టాభి ఏదో మాట్లాడారని వైసీపీ వాళ్లు రీసెర్చ్ చేశారని.. తాను గట్టిగా మాట్లాడతాను కానీ, బూతులు తిట్టనని ఆయన స్పష్టం చేశారు. పట్టాభి మాటలకు కొత్త అర్థాలు చెప్పారని.. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్ వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఈ గుడ్డి సీఎంకు మాత్రం కనిపించదంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios