తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో సెలవు
దాదాపు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలన్నింటికీ ఆ రోజు సెలవు.
తెలంగాణలో వచ్చే నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు తెలంగాణలో మీడియా మినహాయించి.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలన్నింటికీ ఆ రోజు సెలవు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో.. ఎన్నికల రోజు సెలవు ప్రకటించారు.
అయితే.. ఆ రోజు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిసెంబర్ 7వ తేదీ సెలవుగా ప్రకటించింది. ఎందుకంటే.. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ఇంకా తెలంగాణలో ఓటు హక్కు ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారంతా తెలంగాణలో జరిగే పోలింగ్లో పాల్గొనే వెసులుబాటు కల్పించింది.