Asianet News TeluguAsianet News Telugu

అయప్ప మాలలో ఉండి కూడా వంశీ, అవంతీ చెప్పులేసుకుంటారు:వర్ల

టీడీపీ,వైసీపీ నేతల మధ్య వార్ ముదురుతుంది. ఇరు పార్టీలకు సంబంధించిన నేతల విమర్శలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వంశీ,వైసీపీ నేతలు ,.. టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు కోనసాగిస్తున్నారు.

TDP Leaders Vs YSRCP Leaders In andhra pradesh
Author
Hyderabad, First Published Nov 16, 2019, 5:38 PM IST

టీడీపీ,వైసీపీ నేతల మధ్య వార్ ముదురుతుంది. ఇరు పార్టీలకు సంబంధించిన నేతల విమర్శలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వంశీ,వైసీపీ నేతలు ,.. టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు కోనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు వంశీ టార్గెట్ చేస్తూ విమర్శస్తున్నారు. తాజాగా తేదాపా నేత వర్ల రామయ్య .. వంశీ వాఖ్యలపై ఘాటుగా స్పందించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...

వంశీ అయ్యప్పమాల వేసుకుని అలాంటి మాటలు మట్లాడకూడదు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. కానీ తప్పుగా మాట్లాడకూడదు ఆయన మనసును కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారు. వంశీ,మంత్రి అవంతీ అయ్యప్పమాలలో ఉండి కూడా చెప్పులేసుకుంటారు. హైందవ ధర్మాన్ని అగౌరవ పరచి ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నారు. లోకేష్ ను అన్న అన్న అని ఇప్పుడు గున్న అంటున్నాడు. వంశీ వల్లభనేని వంశీమోహన్ కి ఇదే ఫైనల్ వార్నింగ్, జగన్ తో కలిసి తప్పుడు మాటలు మాట్లాడాకు" అంటూ తీవ్ర స్ధాయిలో వంశీపై విరుచుకుపడ్డారు.

అదేవిధంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా వంశీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్రాలు  సందించారు. "వంశీ నేను ఒకే సారీ రాజకీయాలలోకి వచ్చాము..నేను మచిలీపట్నం ఎంపీగా ఎన్నకయ్యాను దురదృష్టవ శాత్తు వంశీ ఓడిపోయాడు. ఆ తర్వాత 2014లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎనవనికయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు పార్టీని విమర్శించటం.. మంచిది కాదు..ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు చేయటం తగదు..రాజేంద్రప్రసాద్ రాజకీయాలలో కి రాక ముందే సర్పంచల సంగం రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసారు...

రాజేంద్రప్రసాద్ కు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే...స్దానిక సంస్దల ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ అప్పు చేసి  డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించారు...సుజనాచౌదిరి ఆదేశాలతోఆ డబ్బులు మాత్రమే పార్టీ ఆదేశాలతో నేను వంశీ వెళ్లి ఇచ్చాము. పార్టీ మారి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటూ" వంశీని ప్రశ్నించారు.

అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా వంశీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు. "మానవత్వం ఉన్న వారు వంశీలా మాట్లాడరు..అన్నా,అన్నా అంటూ ఇంత మోసం చెస్తావా...సంస్కారం ఉన్న వారు మట్లాడే విదంగా మీ బాష లేదు..లోకేష్ చలవ తోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పిన వంశీ..ఇప్పడు లోకేష్ గురించి విమర్శలు చేయటం తగదు..

హద్దు మీరి మాట్లాడితే మేము కూడా మాట్లాడగలం..2006లో నువ్వు పార్టీలోకి వచ్చావ్..నేను 1983 నుండి పార్టీలో ఉన్నా..పార్టీ కి కార్యకర్తలు కొండంత అండ..గన్నవరంలో మంచి నాయకుల్ని చంద్రబాబు తయారు చేస్తారు..టిడిపి.... నాయకుల్ని తయారు చేసే  ప్యాక్టరీ..వంశీ చెప్పే మాటలు అర్దవంతంగా లేవు"..అంటూ ఘాటుగా స్పందించారు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios