ఫేస్బుక్లో అసభ్య రాతలు: పోలీసులకు టీడీపీ నేత యామిని శర్మ ఫిర్యాదు
తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత సాధినేని యామిని శర్మ ఆరోపించారు. ఈ మేరకు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.
విజయవాడ: తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత సాధినేని యామిని శర్మ ఆరోపించారు. ఈ మేరకు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.
తాను రెండు ఫేస్ బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నట్టుగా సాధినేని యామిని శర్మ చెప్పారు. కానీ, తన పేరున కొన్ని నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి ఈ ఏడాది మార్చిలో వచ్చిందన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు.
కానీ రెండు రోజులుగా ఇతర పార్టీలపై తన పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై రెండు రోజులుగా తనకు ఫోన్ చేసి దూషిస్తున్నారని ఆమె చెప్పారు.
ఈ విషయమై నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ఈ విషయమై సీఎం జగన్కు లేఖ రాసినట్టుగా ఆమె గుర్తు చేశారు. మరో వైపు ఈ విషయమై జగన్ను కలిసి వివరించనున్నట్టు తెలిపారు.