కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య
కడప జిల్లాలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.
కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని సిహాంద్రిపురం మండల దిద్దికుంటలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుసునూరు-దిద్దికుంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.