తాడిపత్రి  మున్సిపల్ చైర్మెన్  జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లవద్దని  జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. 

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని మంగళవారంనాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భధ్రతల దృష్ట్యా పెన్షన్ల పంపిణీకి వెళ్లకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీకి తనను అధికారులు ఆహ్వానించారని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. చైర్మెన్ హోదాలో తనకు పెన్షన్ల పంపిణీకి ఆహ్వానం పంపారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred