తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి  జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా అసుమర్లపూడిలో చోటుచేసుకుంది.  

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. వివరాలు.. గుంటూరు జిల్లా అసుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు, మట్టి మాఫియా అడ్డుకుంది. టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. దూళిపాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర.. అక్రమాలను ప్రశ్నిస్తే ‘‘మీకేందుకు భయం’’ అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు.