తల్లిని చంపి, నాలుక కోసి.. పీఎస్ కు తీసుకెళ్లిన కొడుకు...
మద్యం తాగి వచ్చాడని తల్లి మందలించడంతో కోపానికి వచ్చిన ఓ కొడుకు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు.

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం తాగొద్దని మందలించినందుకు తల్లిని అతి దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. తల్లి రమణమ్మను కొడుకు శ్రీనివాసరావు హత్య చేశాడు. తాగి వచ్చాడని మందలించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రాపూర్ వసంతల వీధిలో ఈ దారుణం చోట చేసుకుంది. తల్లిని చంపిన తరువాత.. ఆమె నాలుక కోసి.. దాంతో పాటు నిందితుడు పీఎస్ కు తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.