Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: ఆరుగురికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో  ఇవాళ  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు. సంఘటన స్థలంలో  ఎస్పీఎఫ్  సిబ్బంది  సహాయక  చర్యలు చేపట్టారు. 

  Six  injured in road accident on Tirumala ghat road lns
Author
First Published May 24, 2023, 2:50 PM IST


తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో  బుధవారంనాడు  రోడ్డు ప్రమాదం  చోటు  చేసుకుంది.  తిరుమల నుండి తిరుపతికి  ఎలక్ట్రిక్  బస్సు వెళ్లున్ సమయంలో  ప్రమాదం  జరిగింది.  ఘాట్  రోడ్డులో  డివైడర్ ను ఢీకొని  బస్సు  బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో  ఆరుగురు   భక్తులకు  గాయాలయ్యాయి.  గాయపడిన భక్తులను  రుయా ఆసుపత్రికి తరలించార. మరో వైపు  సంఘటన స్థలంలో  ఎస్‌పీఎఫ్ సిబ్బంది  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం  జరిగిన సమయంలో  బస్సులో  29 మంది  ప్రయాణీకులున్నారు.

గతంలో  కూడ  తిరుమల ఘాట్  రోడ్డులో  ప్రమాదాలు  చోటు  చేసుకున్నాయి. ఈ నెల  14న  తిరుమల ఘాట్  రోడ్డులో  జరిగిన  ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  మరో 15 మంది గాయపడ్డారు.అనంతపురానికి  చెందిన  భక్తులు వాహనంలో  తిరుమల ఘాట్  రోడ్డు నుండి  తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.  స్పీడ్ గా  ఉన్న  వాహనం  అదుపు తప్పింది.  ఈ ప్రమాదం లో  వాహనంలో  ఇద్దరు మృతి చెందారు. మరో  15 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్  23న జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగరు  ప్రయాణీకులు గాయపడ్డారు.   ఈ ఏడాది మార్చి మాసంలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios