Asianet News TeluguAsianet News Telugu

నోట్లో కుంకుమపోయడంతో మరణించిన పునర్విక కేసులో.. వెలుగులోకి కొత్త విషయాలు.. నాన్నమ్మ అక్కడే ఉన్నా..

నెల్లూరులో గురువారం వెలుగులోకి వచ్చిన పునర్విక మృతి కేసులో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు పోలీసులు. ఘటన సమయంలో తల్లి పుట్టింట్లోనే ఉందని, నాయనమ్మ అక్కడే ఉన్నా కొడుకును వారించే ప్రయత్నం చేయలేదు. 

Shocking truths in nellore perareddypally child death
Author
Hyderabad, First Published Jun 17, 2022, 7:57 AM IST

ఆత్మకూరు : తండ్రి చేసిన వింత పూజలతో ఆస్పత్రి పాలైన punarvika మూడేళ్ల పసిప్రాయంలోనే మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పేరారెడ్డిపల్లికి చెందిన పునర్విక నోట్లో ఆమె తండ్రి వేణుగోపాల్ పూజల్లో భాగంగా కుంకుమ కుక్కాడు. దాంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను చికిత్స కోసం చెన్నై తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించింది. ఆత్మకూరు ఎస్ఐ శివ శంకర్ రావు గురువారం చిన్నారి నాన్నమ్మ దొరసానమ్మను, ఇతర కుటుంబసభ్యులను విచారించగా మరిన్ని వివరాలు తెలిశాయి. వేణుగోపాల్ భార్య యామిని తన ఇద్దరు పిల్లలతో కలిసి అనుసముద్రంపేట మండలం కుప్పురుపాడులోని పుట్టింటికి వెళ్ళింది.

మంగళవారం అత్తారింటికి వెళ్ళిన వేణుగోపాల్ తన ఇద్దరు కుమార్తెలు పూర్విక, పునర్వికలను వెంటపెట్టుకుని సొంతూరు పేరారెడ్డిపల్లికి వచ్చాడు. బుధవారం ఉదయం పిల్లలకు కర్పూరం దృష్టి తీయించి, ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని వింత పూజలు చేశాడు. పూర్వికను గదిలో నుండి బయటకు పంపాడు. పునర్వికను గదిలోనే ఉంచి ఆమె నోట్లో కుంకుమ కుక్కాడు. ఈ వింత చేష్టలు దగ్గరుండి చూస్తున్నా వేణుగోపాల్ తల్లి దొరసానమ్మ అతడిని వారించలేదు. రెండు గంటల పాటు ఈ తంతు కొనసాగింది. తర్వాత పూర్వికను వెంట బెట్టుకొని దొరసానమ్మ వీధిలోకి వచ్చింది.

మూడేళ్ల కూతురి ఒంటిమీద పసుపునీళ్లు పోసి, నోటినుండా కుంకుమ పోసి కన్నతండ్రి పూజలు.. ప్రాణాపాయస్థితిలో చిన్నారి..

అయితే, కర్పూరం తో దిష్టి తీయడం.. పెద్ద బొట్టుతో పూజలు ఇవన్నీ.. చూస్తున్న స్థానిక నిలదీయడంతో లోపల జరుగుతున్న పూజతంతును ఆమె వివరించింది. దీంతో వెంటనే స్థానికులు ఇంటి తలుపులు తీయించారు. అయితే అప్పటికే Punarvika అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి బాలిక తల్లి యామిని వెంటనే పుట్టింటి నుంచి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న తన కుమార్తె ను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. బాలిక తండ్రి వేణుగోపాల్ ను పోలీసులు విచారిస్తున్నారు. 

కాగా, శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుంటుందని... అది పోవాలంటే పూజలు చేయాలి.. అనుకున్న ఓ తండ్రి.. తన కన్న కూతురి ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. ఒంటిపై పసుపు నీళ్ళు పోసి, నోటి నిండా కుంకుమ పోసి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ప్రొక్లెయిన్ నిర్వహణతో నష్టపోయిన వేణుగోపాల్.. బుధవారం తన  కవల కుమార్తె ల్లో ఒకరైన Punarvika (3)ను  పూజగదిలో పడుకో బెట్టి,  పసుపు నీళ్లు పోశాడు. తర్వాత నోట్లో కుంకుమ, పసుపు పోసి మింగమని బలవంత పెట్టాడు. అయితే ఆ పసుపు, కుంకుమలతో ఊపిరి ఆడకపోవడంతో..  బాలిక కేకలు వేసింది. 

అయితే, ఆ సమయంలో భార్య అక్కడే ఉందని ముందుగా అంతా అనుకున్నారు. అయితే ఆమె పుట్టింట్లో ఉందని తరువాత పోలీసుల విచారణలో తేలింది. ముందు చుట్టుపక్కల వారే వచ్చి ఆ చిన్నారిని.. మొదట ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి చెన్నైకి తీసుకువెళ్లారు. తాను దేవుడినని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వేణుగోపాల్ ను బంధువులు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. వేణుగోపాల్ గత మూడు రోజులుగా ఏవేవో పూజలు చేస్తూనే ఉన్నాడని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆత్మకూరు ఎస్ఐ శివశంకరరావు కేసు నమోదు చేసి వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios