ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. బేస్తవారిపేటకు చెందిన రమణారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. 

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. బేస్తవారిపేటకు చెందిన రమణారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న రమణారెడ్డిని మాస్కులు ధరించిన దుండగులు బయటికి పిలిపించి మరీ కత్తులతో దారుణంగా హతమార్చారు..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భర్తపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన భార్యపైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. హత్యానంతరం దుండగులు కారులో పారిపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలు, ఇతర వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.