ఏపీ  సీఎం జగన్ కాన్వాయ్ కు   మంగళవారంనాడు  కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కు మంగళవారంనాడు కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది కానిస్టేబుల్ ను పక్కకు తప్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎంకు వినతి పత్రం సమర్పించేందుకు గాను కానిస్టేబుల్ సీఎం కాన్వాయ్ కు అడ్డుపడ్డాడు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గుంటూరులోని కార్యక్రమంలో పాల్గొని క్యాంప్ కార్యాలయానికి సీఎం చేరుకుంటున్న సమయంలో కానిస్టేబుల్ సీఎం కాన్వాయ్ కు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది కానిస్టేబుల్ ను పక్కకు తప్పించారు. 

కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీఎంకు వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నించేందుకు గాను సీఎం కాన్వాయ్ కు అడ్డుపడినట్టుగా కానిస్టేబుల్ పోలీసులకు చెప్పారు.పర్యటనలకు వెళ్లిన సమయంలో తనకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రయత్నించేవారి వద్ద నుండి సీఎం జగన్ వినతి పత్రాలు తీసుకుంటారు. సీఎం చుట్టూ ఉన్న భద్రత కారణంగా వినతి పత్రాలు అందించేందుకు ఇబ్బంది పడేవారి కోసం కొన్ని సమయాల్లో సీఎం జగన్ వారి వద్దకు వెళ్తారు.