మీడియా మేనేజ్మెంట్ తెలుసుకోండి: ఏపీ బీజేపీ నేతలకు మోడీ సూచన
తనయుడు నారా లోకేశ్ను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలను బా బు తుంగలో తొక్కారని ప్రధాని ఎద్దేవా చేశారు.
తనయుడు నారా లోకేశ్ను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలను బా బు తుంగలో తొక్కారని ప్రధాని ఎద్దేవా చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. మీడియా మేనేజ్మెంట్పై అవగాహన కలిగి ఉండాలని మోడీ పార్టీ నేతలకు హితబోధ చేశారు.
మీడియాలో కిందిస్థాయి వ్యక్తులతో కూడా సన్నిహితంగా మెలగాలని ప్రధాని సూచించారు. మీడియాను తిడుతూ కూర్చోవడం కన్నా...ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.