అధిక వడ్డీ ఆశ చూపి చిత్తూరు, పుత్తూరులో ఘరానా మోసం.. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన సంస్థ..
జనాల అత్యాశను ఆసరాగా చేసుకని.. అధిక వడ్డీ ఆశ చూపి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ దాదాపు రూ. 152 కోట్ల మేర వసూళ్లకు పాల్పడి రాత్రి రాత్రే బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ బాధితుల్లో తిరుపతి, పూత్తురు తిరుత్తణి, చెన్నై వంటి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
జనాల అత్యాశను ఆసరాగా చేసుకని.. అధిక వడ్డీ ఆశ చూపి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ దాదాపు రూ. 152 కోట్ల మేర వసూళ్లకు పాల్పడి రాత్రి రాత్రే బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ బాధితుల్లో తిరుపతి, పూత్తురు తిరుత్తణి, చెన్నై వంటి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఫారిన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ పేరుతో లాభాలు, అధిక వడ్డీల ఆశచూపి ప్రజల నుంచి కోట్లాది రూపాయల వసూలు చేసిన సదరు సంస్థ.. పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై కేంద్రంగా ఉన్న సంస్థల్ని రాత్రికిరాత్రే ఖాళీచేసి వెళ్లిపోయింది. దీంతో అధిక వడ్డీ ఆశతో కష్టపడి సంపాదించిన డబ్బును ఆ సంస్థలో పెట్టుబడిగా పెట్టిన జనాలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
చెన్నై కేంద్రంగా పనిచేసే నోబెల్ అసెట్స్ సంస్థ 2018లో పుత్తూరులో కార్యాలయం ప్రారంభించింది. చెన్నై, తిరుత్తణి కేంద్రంగా రూ.100 కోట్ల పైబడి ఫారిన్ ట్రేడింగ్, షేర్మార్కెట్ వ్యాపారాలు సాగిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన నగదును అంతర్జాతీయ షేర్మార్కెట్లో పెట్టుబడి పెడితే అమెరికన్ డాలర్, యూరప్ యూరోల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఈ క్రమంలోనే పలు గ్రామాలకు చెందిన ప్రజలు వారిని నమ్మి పెట్టుబడులు పెట్టారు. తొలుత రూ.లక్ష పెట్టుబడికి నెలకు రూ.8వేలు వడ్డీ గిట్టుబాటయ్యేలా ఏర్పాట్లుచేశారు. ఇది చూసి మరికొంత మంది పెట్టుబడులు పెట్టారు. వారి నుంచి సంస్థ భారీ మొత్తంలో డబ్బులు కట్టించుకుంది.
మరోవైపు ఆ సంస్థ తిరుపతిలోనూ బ్రాంచ్ ప్రారంభించింది. ఇక్కడ రూ.40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించిన సంస్థ యజమాన్యం పుత్తూరు, తిరుపతి, తిరుత్తణి, చెన్నై కేంద్రంగా ఉన్న కార్యాలయాల్ని రాత్రికిరాత్రే ఖాళీచేసి ఉడాయించింది.