Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉద్దేశ్యూర్వకంగా చేస్తున్న తప్పుడు  ప్రచారానికి చెక్ పెట్టాలని జనసేన నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై లీగల్ నోటీసు ఇవ్వనుంది.

pawan kalyan decides to give legal notice to ysrcp
Author
Amaravathi, First Published Aug 23, 2019, 10:51 AM IST


అమరావతి: వైఎస్ఆర్‌సీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయాలని జనసే నిర్ణయం తీసుకొంది. అంతేకాదు లీగల్ నోటీసులు కూడ ఇవ్వనున్నారు.సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంపై జనసేన ఈ నిర్ణయం తీసుకొంది.

వైఎస్ఆర్‌సీపీ కి చెందిన కొందరు సోషల్ మీడియాలో జనసేనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎండగట్టాలని కూడ నిర్ణయం తీసుకొంది. ఈ తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాదు తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్‌సీపీ పై లీగల్ నోటీసులు కూడ పంపాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్  సీరియస్ గా ఉన్నట్టుగా  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios