చర్చికి వచ్చిన బాలికను ట్రాప్ చేసిన పాస్టర్.. నూజివీడులో వెలుగుచూసిన ఘటన..
కృష్ణా జిల్లా నూజివీడులో ఓ చర్చి పాస్టర్ వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఆరోగ్యం బాగోలేదని చర్చికి వచ్చిన బాలికను స్వస్థత పేరుతో ట్రాప్ చేశాడు.
కృష్ణా జిల్లా నూజివీడులో ఓ చర్చి పాస్టర్ వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఆరోగ్యం బాగోలేదని చర్చికి వచ్చిన బాలికను స్వస్థత పేరుతో ట్రాప్ చేశాడు. బాలికను తీసుకుని పారిపోయాడు. వివరలు.. 45 ఏళ్ల నాగేశ్వర్ పాస్టర్గా ఉన్నారు. నాగేశ్వర్ భార్య క్యాన్సర్తో చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరోగ్యం బాగోలేదని చర్చికి వచ్చిన బాలికను నాగేశ్వర్ ట్రాప్ చేశాడు. ప్రేమించానని నమ్మంచి.. బాలిక తీసుకుని వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికను, పాస్టర్ను పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.