ఏపీ హైకోర్టు ముందు వృద్ద దంపతులు సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.  వీరిని దేవేందర్, భానుశ్రీలుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.

అమరావతి: ఏపీ హైకోర్టు (ap high court)ముందు వృద్ద (old age couple) దంపతులు సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డారు.తమకు న్యాయం చేయాలని వృద్ద దంపతులు హైకోర్టు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ద దంపతులను గుంటూరు జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం దూళిపాళ్లకు చెందిన దేవేందర్(devender), భానుశ్రీ (bhanu sri)దంపతులుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్రామంలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం స్థానిక నేతలు ఈ దంపతులను సెంట్ భూమి ఇవ్వాలని కోరారు.

ఈ విషయమై స్థానిక నేతలతో వృద్ద దంపతులకు మధ్య వివాదం చోటు చేసుకొంది.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని వృద్ద దంపతులు హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆత్మహత్యాయత్నాఅడ్డుకొన్నారు. వృద్ద దంపతులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.