Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయమై ఈ నెల 16వ తేదీ లోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సోమవారంనాడు ఆదేశించింది.ఈ నెల 20వ  తేదీన ఈ కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
Nimmagadda case:Ap high court orders government to file affidavit before april 16
Author
Amaravathi, First Published Apr 13, 2020, 12:10 PM IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయమై ఈ నెల 16వ తేదీ లోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సోమవారంనాడు ఆదేశించింది.ఈ నెల 20వ  తేదీన ఈ కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణకు స్వీకరించింది.

ఈ నెల 16వ తేదీలోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ ఆఫిడవిట్ పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.

ఈ కేసును ఈ నెల 20వ తేదీన పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని హైకోర్టు దర్మాసనం ప్రకటించింది.ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు 619 జీవో జారీ చేసింది.

also readLనిమ్మగడ్డ రమేష్ కుమార్ ఔట్: ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్

కనగరాజ్ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించారు. దీంతో రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు హైకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.కరోనాను పురస్కరించుకొని ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు రమేష్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది.
Follow Us:
Download App:
  • android
  • ios